మహాశివరాత్రి సందర్భంగా మంత్రి ఆనం శనివారం గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. భక్తులకు సౌకర్యాల మెరుగుదల, రహదారుల విస్తరణ, నిత్యపూజల నిర్వహణకు నిధులు అవసరమని పేర్కొన్నారు. అవసరమైన అదనపు నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
